కరోనా వైరస్ వ్యాపించి సంవత్సరం అయింది..! ఇప్పటికీ ఈ మహమ్మారిని అంతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ..ఏదో ఒక కారణంతో విఫలం అవుతూనే ఉన్నాయి..! తాజాగా ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో విస్తుగొలిపే నిజాలను గుర్తించారు..! మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ తీసుకున్నవారిని పరీక్షించగా వారికి హెచ్ఐవి పాజిటివ్ యాంటీ బాడీస్ ఉన్నట్టు తేలింది..! పూర్తి వివరాలు ఇలా..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ, సిఎస్ఎల్ ఔషధ సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ మధ్యలోనే ఆపేస్తున్నట్లు తయారీదారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు..
తొలిదశలో ఆశించిన ఫలితాలను ఇవ్వగా… రెండు, మూడు దశల్లో కొంతమంది వాలంటీర్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులు వచ్చినట్లు వారు గుర్తించారు. అయితే అంత ప్రమాదకరమైనవి కావని తెలిపారు. మొదటి దశ క్లినికల్ ట్రైల్ లో మంచి ఫలితాలే వచ్చాయి. ఈ టీకా తో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే రెండు, మూడు దశలలో మాత్రం షాకింగ్ నిజాలను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన లక్షణాలు చూస్తే హెచ్ఐవి పాజిటివ్ యాంటీబాడీలుగా నిర్ధారణ అయినట్లు వెల్లడయింది. దీనివలన హెచ్ఐవి లేని వారికి కూడా ఆ యాంటీబాడీలు పాజిటివ్ వచ్చిందన్నారు.
అయితే ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అలాగని ఆ వ్యక్తులకు హెచ్ఐవి సోకినట్లు కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారికి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ అని తేలినట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా 5 తో పాటు ఇంకొన్ని సంస్థలతో వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది దీంతో సిసిఎల్ ప్రయోగాలు ముగిసాయి.