మంగళవారం కోజికోళ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రియనందనన్; photo courtesy: The Hindu
మళయాళ సినీరంగం నుంచి జాతీయ ఆవార్డు సాధించిన దర్శకుడు టి.ఐర్.ప్రియనందన్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆయన ముఖంపై ఆవు పేడ పులిమాడు. త్రిసూర్ లోని ప్రియనందన్ ఇంటి దగ్గర శుక్రవారం ఈ సంఘటన జరిగింది. దీనిపై కేరళ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
ప్రత్యేకించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. దీనికి ఆర్ఎస్ఎస్ కారణమనీ, వారు సామాజిక న్యాయానికీ, సెక్యులరిజానికీ కట్టుబడ్డ మేధావులపై దాడులు చేస్తునారనీ ఆయన విమర్శించారు. కేరళ ఇలాంటి దాడులను సహించదని ఆయన అన్నారు.
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలూ వెళ్లవచ్చన్నందుకు బిజిపి వారి నుంచి తనకు ప్రాణాలు తీస్తామన్న బెదిరింపులు వచ్చాయని ప్రియనందనన్ ద హిందూ దినపత్రికకు తెలిపారు. ఆయన ఇంటి దగ్గర బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇల్లు దాటి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారని ప్రియనందనన్ తెలిపారు. ఈ రోజు తనపై దాడి చేసింది ఒక బిజెపి కార్యకర్త అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని పోలీసు ఐజి అజిత్ కుమార్ తెలిపారు.