ఎన్నికలు అన్నాక క్యాడర్లో ఉత్సాహం నింపేలా నేతలు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం సహజం. అవి ఎన్నికల్లో వేడి పుట్టించేలా, ఓటర్లకు ఆశలు కల్పించేలా ఉంటాయి. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పుణ్యమా అని ఎడా పెడా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఎం మాట్లాడతారో, అది ఎక్కడికి వెళ్తుందో తెలియక బీజేపీ నాయకులే భయపడుతున్నారు. తాజాగా ఆయన బీజేపీ జెండా గ్రేటర్లో ఎగిరితే ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రిక్స్ చేస్తామంటూ ప్రచారంలో వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.
రోజుకో మాట… తూటా
బండి సంజయ్ ఇస్తున్న హామీలు, చెబుతున్న మాటలు బీజేపీ కు మైలేజి తెచ్చేకంటే అభాసుపాలు చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన పోటీలోకి వచ్చిన బీజేపీ నాయకుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే అయన పూర్తిగా ఓటర్లను సందిగ్ధంలో పడేసేలా ఉన్నాయి. అంతేకాదు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, హైద్రాబాద్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో రెండు మతాలను విడదీసి బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల హిందువుల్లో అభద్రతా భావం వచ్చేలా ఉందని హైద్రాబాద్ నగరాన్ని ఎప్పటినుంచో చూస్తున్న పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్క తెరాస, మరో పక్క ఎంఐఎంతో ఒకేసారి పొందాల్సిన పరిస్థితి బీజేపీ ది. ఈ రెండు యుద్ధాల్లో ఏ మాత్రం వెనక్కు తగ్గినా బీజేపీ మేయర్ పీఠం మీద ఆశలు వదులుకోవాల్సిందే. దింతో బండి సంజయ్ ఒక్కో రోజు ఒక్కో పార్టీ టార్గెట్ చేస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు… అవేంటంటే….
* ఆర్ఆర్ఆర్ సినిమా కొమరం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ట్రైలర్ విడుదల చేసినపుడు దానిలో ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో కనిపించడం వివాదం అయ్యింది. దీన్ని బండి సంజయ్ వాడుకోవాలని చూసారు. భీం పాత్ర కు ముస్లింగా చూపిస్తే రాజమౌళి తీవ్రమైన అమాశాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
* హైద్రాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తీసేస్తామని, ఆలా కాకుంటే ట్రాఫిక్ చలాన్ రాస్తే దాన్ని జిహెచ్ఎంసి కడుతుందని హామీ ఇవ్వడం వివాదం అయ్యింది. రోజు కొన్న కోట్ల రూపాయల చలాన్లను కార్పొరేషన్ ఎలా కడుతుందని, ఆలా అయితే దివాళా ఖాయమని బీజేపీ నాయకులే బండి వ్యాఖ్యల పట్ల ఘరమ్ ఘరమ్ అయ్యారు.
* జనసేన పార్టీతో పొత్తు ఉండదని ఎవరిని సంప్రదించకుండానే ఆయన ప్రెస్ కు చెప్పడం, తర్వాత ఈ అంశంపై వివాదం అయ్యి ఏకంగా పవన్ స్పందించి, హైద్రాబాద్ ఎన్నికల్లో తాము అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పడం, అనంతరం బీజేపీ నాయకులూ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ వద్దకు వెళ్లి ఆయనను ఒప్పించడం, జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. దీని అంతటికి బండి వ్యాఖ్యలే ప్రధాన కారణం.
* గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ అంటూ బండి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పెడుతున్నాయి. 150 డివిజన్ లు ఉన్న జీహెచ్ఎంసీలో సుమారు 30 నుంచి 40 స్థానాల వరకు ఎంఐఎం ప్రభావితం చేసేవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడితే మరి వారికీ బండి వ్యాఖ్యలు అడ్డంకి కావా అని బీజేపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. హిందువులకు ధైర్యం చెప్పే మాటలు బండి సంజయ్ మాట్లాడితే బాగుంటుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ లో తెరాస నాయకీలు నువ్వా నేనా అని సమాధానం చెప్పే నాయకుల్లో, కొంచెం గట్టిగా మాట్లాడే వారిలో బండి సంజయ్, దుబ్బాక నుంచి గెలిచినా రఘునందన్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లు ముందున్నారు. రాజాసింగ్ ఎప్పుడూ తగ్గరు. అయితే ఒక్కోసారి మాట్లాడే విషయంలో లైన్ గతి తప్పి వేరే స్టేట్మెంట్స్ వరకు వెళ్లడం బీజేపీకు లాభం కంటే నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని నేతలు గమనిస్తేనే దొర నోటిని అడ్డుకోగలరు.