నాలుగో సీజన్ బిగ్బాస్ ప్రేక్షకులకు అనేక సర్ప్రైజ్ లు ఇస్తోంది. మొదటి మూడు వారాల్లోనే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లను దింపేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. అలా వచ్చిన వారిలో ముక్కు అవినాష్ ఒక్కడే ఇంట్లో నిలదొక్కుకోగా స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఇంటిముఖం పట్టారు. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అనుకున్న దేవి నాగవల్లి, దివ్ వద్యా ఇల్లు వదిలి వెళ్లిపోవడం ప్రేక్షకులకు వింతగా అనిపించింది.
బిగ్బాస్ నిర్వాహకులు ఒక కొత్త ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎలిమినేషన్ విషయంలో కంటెస్టెంట్ లకు అన్యాయం జరుగుతోందని ప్రేక్షకుల దగ్గర నుండి ఒక అభిప్రాయం ఉంది. షో డైరెక్షన్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుంది అని విషయంలో చాలా నెగిటివిటీ అవుతోంది అని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో నుంచి మరో ముగ్గురిని ఇంట్లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
కుమార్ సాయి, దేవి నాగవల్లి కొంతమంది కంటెస్టెంట్ లకు ఓట్లు వేసేందుకు అవకాశం ఇస్తూ వారిని తప్పించి ఎలిమినేషన్ పై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిచ్చేందుకు ఒక అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఇలా అత్యధిక ఓట్లు వచ్చిన వారిని మళ్లీ ఇంటిలోకి పంపించే ఏర్పాట్లు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత సీజన్ లో అలీ రెజా ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇలాగే లోనికి వచ్చి మళ్ళీ ఫైనల్ వరకు దూసుకెళ్ళాడు.
రెండవసారి బంగారంలాంటి అవకాశం వస్తే బయటకు వెళ్ళిన వారు గేమ్ చూసి నుంచి వచ్చి మరింత తెలివిగా ఆడతారు. ఇక దీనిని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.