చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో టిడిపి నాయకులను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు టిడిపి సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న టిడిపి నాయకులను స్ర్కిప్ నాయకులూ, కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులపై వైస్సార్సీపీ కార్యకర్తలు దడి చేసి, వారు వెళ్తున్న కార్ల అద్దాలు పగలగొట్టారు. భయానక వాతావరణం సృష్టించారు. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ , రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లను గ్రామంలోకి రానీయకుండా అడ్డుకుని వారి కార్లకు అడ్డుగా కొందరు పడుకుంటే, మరికొందరు కార్ల పైకి ఎక్కి నినాదాలు చేసారు. బహనాలను ధ్వంసం చేసారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు లో జరిగిన ఈ ఉద్రిక్త త వాతావరణంఇంకా కొనసాగుతోంది. జాతీయ రహదారి మీద ఈ తంతు సాగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్కు క్రమబద్దీకరించి టీడీపీ నాయకులను పోలీసులు వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. భారీగా పోలీసులు మోహరించి ఇరు పక్షాలను సాథింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.