Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ “టికెట్ టూ ఫినాలే” టాస్క్ లో… హౌస్ లో మిగిలి ఉన్న ఏడుగురు సభ్యులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఏదో రీతిలో టాప్ ఫైల్ లోకి చేరాలని.. తీవ్రంగా కృషి చేశారు. కొంతమంది టాస్క్ లో బ్లడ్ పెట్టేశారు.., మరికొంతమంది తమ ప్రాణం మీదికి తెచ్చుకున్నరీతిలో గేమ్ ఆడారు. ఇక ఇదే సమయంలో తమ తెలివితేటలకు కూడా మంచి పదును పెడుతూ తమలో ఉన్న నైపుణ్యాన్ని… టికెట్ టూ ఫినాలే టాస్క్ లో బయటపెట్టారు. అయితే చివరాకరికి ఈ “టికెట్ టూ ఫినాలే” లో… గెలిచిన కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర(Sri Ram Chandra). హౌస్ లో మొదటి నుండి కూల్ గేమ్ ఆడుతూ… ఒకరిని డిస్టర్బ్ చేయకుండా… మాట్లాడే సమయంలో సరైన పాయింట్ మాట్లాడుతూ అద్భుత గేమ్ ఆడుతూ ఉన్నాడు.
గేమ్ నీ గేమ్ లాగా చూస్తూ… తనదైన శైలిలో టాస్క్ లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తూ… రాణించిన శ్రీ రామ్…”టికెట్ టూ ఫినాలే”(Ticket To Finale) లో కూడా… తన శక్తి మేర రాణించి తన కళ్ళకి డ్యామేజ్ జరిగినా గాని చివరి వరకు పోరాడి గెలవడం జరిగింది. సో ఈ సీజన్ ఫైవ్ టిక్కెట్టు ఫినాలే లో… టాప్ ఫైవ్ లో చేరిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీ రామచంద్ర.. లిస్టు లో చేరాడు. దీంతో శ్రీ రామచంద్ర ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బయట శ్రీ రామ్ చంద్ర కి టాప్ సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
దేశంలో ఎంతోమంది పేద వాళ్ళని అదే రీతిలో లాక్డౌన్ సమయంలో వలస కూలీలకి ..కరోనా సమయంలో కరోనా బాధితులని ఆదుకుని సహాయం చేస్తూ వస్తున్న సోనుసూద్(Sonu Sood)…శ్రీ రామ్ కి మద్దతు కూడా కూడగట్టుకున్నాడు. శ్రీ రామ్ చంద్ర మంచి ప్లేయర్ అదే రైతుల మంచి మనసున్న వ్యక్తి అని అందరూ అతనికి సపోర్ట్ చేయాలని సోను సూద్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సింగర్ నోయాల్ కూడా… తన మద్దతు శ్రీరామ్ కి అనీ స్పష్టం చేశారు. ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు శ్రీరామ్ కి సపోర్ట్ చేయగా.. ఈ సీజన్ ఫైవ్ లో శ్రీరామ్ టాప్ ఫైవ్ లో చేరడంతో.. హౌస్ లో లెక్కలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.