సుశాంత్ సింగ్ మరణ వార్త పై బాలీవుడ్ ఇండస్ట్రీపై అదేవిధంగా రాజకీయ నాయకుల పై తనదైన శైలిలో కామెంట్లు చేసింది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ సమయంలో ఇండస్ట్రీకి చెందిన చాలామంది అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన కొన్ని పొలిటికల్ పార్టీల నాయకులు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలపడం కూడా జరిగింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కంగనారనౌత్ ఆమె సోదరి రంగోలి చందెల్ అప్పట్లో సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినట్లు ఇంటర్వ్యూలు కూడా ఉన్నట్లు డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా సోదరులు విచారణకు హాజరు కావాల్సిందిగా అప్పట్లో పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఇటువంటి తరుణంలో తమపై ఉన్న కేసును కొట్టేయాలని కంగనా ఆమె సోదరి ఇటీవల ముంబై హైకోర్టును ఆశ్రయించడం బాలీవుడ్ మీడియాలో జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కేవలం తమ ఉద్దేశాలు మాత్రమే వెల్లడించాలని హై కోర్టుకు వివరణ ఇవ్వటమే కాక పోలీసు సమాన్లను గౌరవిస్తూన్నట్లు తెలిపిన మీ అక్క చెల్లెలు పోలీసులు తమను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో కంగనారనౌత్ అభ్యర్థన విన్న ముంబై హైకోర్టు వారిని అరెస్టు చేయకుండా ఉత్తర్వులు పోలీసులకు జారీ చేసింది. ఈక్రమంలో దేశద్రోహం కేసులో కంగనా రనౌత్ ఆమె సోదరి వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు నమోదు చేయడం జరిగింది.