గుంటూరు. ఏప్రిల్ 14: వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు ఐజి, ఎస్పిలను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్పై జరిగిన దాడికి సంబంధించి తమ పార్టీ నేతలు అంబటి రాంబాబు తదితరులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని బొత్సా అన్నారు. అంబటి రాంబాబు తదితరులపై అక్రమంగా నమోదు చేసి కేసులను ఎత్తివేయాలని బొత్సా డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజు జరిగిన దాడులు, వైసిపి నేతలపై కేసుల నమోదు తదితర అంశాల పరిశీలనకు ఆ పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది నాయకులతో నిజ నిర్ధారణ బృందాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నియమించారు. ఈ బృందం ఆదివారం గుంటూరు జిల్లాలో గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో ఘర్షణలు జరిగిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదికను పార్టీ అధినేత వైఎస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి అందజేయనున్నారు.
అక్రమ కేసుల నమోదుపై ఆదివారం సాయంత్రం బొత్సా సత్యనారాయణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తదితర సీనియర్ నేతలు గుంటూరు ఐజి, ఎస్పిలను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.