Brahmastra: బ్రహ్మాస్త్ర.. Brahmastra బాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండేళ్ల నుంచీ షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలు.. భారీ క్యాస్టింగ్.. పెద్ద నిర్మాత, సక్సెస్ ఫుల్ డైరక్టర్.. చారిత్రక కథాంశం.. ఇలాంటి అనేక హంగులతో ఈ సినిమా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ అవుతున్న దశలో ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ‘బ్రహ్మాస్త్ర’ను రెండు పార్ట్స్ లో విడుదల చేయనున్నారనేది ఆ వార్త. మొదటి పార్ట్ ను ఈ ఏడాది.. లేదంటే వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ లోనే విడుదల చేస్తారని.. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్స్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే వీటిని సెన్సార్ బోర్టు వెరిఫికేషన్ కు పంపించడం.. అక్కడి నుంచి ఎటువంటి కట్ లేకుండా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలోని నటులను, పాత్రలను ఈ టీజర్స్, పోస్టర్స్ ద్వారానే రివీల్ చేస్తారని తెలుస్తోంది. సినిమా కథాంశం దాదాపు 5వేల ఏళ్ల క్రితం నాటిదని అంటున్నారు. దీంతో సినిమాపై భారీ హైప్ వచ్చేసింది. ఇందుకు తగ్గట్టుగానే నిర్మాత కరణ్ జోహార్ భారీ లెవల్లో ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సోషియే ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్.. తదితరులు నటిస్తున్నారు.
Read More: Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..! నిన్న కర్ణాటకలో.. నేడు గుంటూరులో.. ప్రారంభం
సినిమాలో రణబీర్ కపూర్ శివ, అలియా ఇషా పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున.. పురాతన ఆలయాల కోసం పరిశోధనలు చేసే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర అనే ఒక ఆయుధం చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. దీంతో సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇన్ని అంచనాల మధ్య సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని భావిస్తున్నారట. అయితే.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సినిమా టీజర్, సినిమా రిలీజ్ డేట్ పై టీమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక వీటన్నింటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!