BRS MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఊరట లభించలేదు. ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపర్చారు.
కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా, ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23వరకూ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం పది రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే .. వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతి ఇవ్వడం జరిగింది.
అంతకు ముందు కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి, మోహిత్ రావులు కోర్టులో వాదనలు వినిపించారు. కవితను అక్రమంగా అరెస్టు చేశారనీ, రిమాండ్ కు ఇవ్వొద్దని న్యాయవాదులు కోరారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్టు చేశారన, సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టు ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు. తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పి, ఉల్లంఘించారన్నారు. మహిళను ఈడీ కోర్టుకు పిలవడానికి సంబంధించి కవిత ఫైల్ చేసిన కేసు పెండింగ్ లో ఉందన్నారు. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ కు అధికారులు కట్టుబడి లేరని కవిత తరపు న్యాయవాదులు వాదించారు.
ఈడీ తరపున ఎన్ కే మట్టా, జోసెబ్ హుస్సేన్ లు వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకూ ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హజరు పర్చాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుండి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది.
Loksabha Elections: ఏప్రిల్ 19 నుండి లోక్ సభ ఎన్నికల పోలింగ్ .. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు