విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వెళుతున్న కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కల్వర్టును కారులో ప్రయాణిస్తున్న వారు గుర్తించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
అమరనాథ్ గుహ వద్ద వరద భీభత్సం .. 15 మంది మృతి.. 40 మంది గల్లంతు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారును జేసీబీ సహయంతో బయటకి తీశారు. కారు నెంబర్ ఆధారంగా మృతి చెందిన వారు ఉత్తర ప్రదేశ్ వాసులుగా భావిస్తున్నారు. అయితే కారులో 12 గంజాయి ప్యాకెట్లు పోలీసులకు లభ్యం కావడంతో మృతులు గంజాయిని అక్రమంగా రవాణా తరలిస్తున్నట్లు తెలుస్తొంది.