హైదరాబాదు, మార్చి 27: కేంద్రంలో నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని రెండు కోట్ల పది లక్షలు వసూలు చేశారన్న ఆరోపణతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుతో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి.
తాళ్ల ప్రవర్దారెడ్డి ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో వారిపై ఐపిసి 406,420,468తో పాటు 471,506,(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మురళీధర్రావు సన్నిహితుడైన కృష్ణకిషోర్ బిజెపి అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని నమ్మించి డబ్బులు వసూలు చేశారని ప్రవర్దారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
మురళీధర్రావుతో పాటు నిందితులుగా కృష్ణకిషోర్, ఈశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డి, హనుమంతరావు, చంద్రశేఖరరెడ్డి, బాబా, శ్రీకాంత్, శ్రీనివాస్లు ఉన్నారు.
ఎఫ్ఐఆర్ కాపీ కొరకు కింద క్లిక్ చేయండి