(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. లడ్డూలో బొద్దింక గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.