Congress: ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. అలానే అయిదు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది. కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ నుండి పల్లంరాజు, రాజమండ్రి నుండి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలం, కర్నూలు నుండి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వార రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోక పోగా, పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు కూడా దక్కలేదు.
మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరిపోగా, క్యాడర్ కూడా ఆ పార్టీకి షిప్ట్ అయ్యింది. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి, సోదరుడు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తుండటంతో కొంత ఊపు వస్తొంది. వైసపీలో ఇమడలేని నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు.
Janasena: జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ .. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్