కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలంతా వణికిపోతుంటే… ఆ భయాన్ని చాలా మంది సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులను ఆసరాగా తీసుకున్న కొంతమంది కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే మందులను అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ మందులు వాడితే అసలు కరోనా రానే రాదని మరియు వచ్చిన వారికి వెంటనే నయం అయిపోతుందని మాయ మాటలు చెబుతూ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఇకపోతే ముఖ్యంగా కరోనా చికిత్సకు ఉపయోగించే ఫెవిఫిరావిర్, రెమిడెసివిర్ టాబ్లెట్లను రూపాయల 30 వేల చొప్పున బ్లాక్ మార్కెట్లో అమ్ముతుండడం గమనార్హం. మార్కెట్లో రెమిడెసివిర్ ఇంజక్షన్ 5 వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే వీరు మాత్రం అందుకు 5 రెట్లు ఎక్కువ మొత్తానికి అమ్మి బాధితుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత వారి వద్ద నిల్వ ఉన్న టాబ్లెట్లను, ఇంద్జెక్షలను స్వాధీనం చేసుకున్నారు.
కరుణ చికిత్సలో ఈ ఫెవిఫిరావిర్, రెమిడెసివిర్ టాబ్లెట్లు మరియు ఇంజక్షన్లు ఎక్కువగా వాడుతుండటంతో మార్కెట్ లో ఈ డ్రగ్ కి బాగా డిమాండ్ పెరిగింది. అయితే స్వల్ప లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉన్న వారికి మరియు హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి వారు బయటికి వెళ్ళలేరు కాబట్టి వీటిని చాలా సులువుగా అధిక ధరకు బ్లాక్ లో విక్రయిస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ కి మార్కెట్స్ లో కొరత సృష్టించి అన్నీ బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తుండడంతో చాలామంది వేరే దారి లేక తమ ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆశతో వారు చెప్పిన ధరకే కొంటున్నారు.