సాధారణంగా భార్యాభర్తలిద్దరూ గొడవలు పడి విడిపోయి విడాకులు తీసుకుంటే భర్త దగ్గర నుంచి భార్య తగిన పరిహారం చెల్లించాలని కోరుతుంది. లేదా ప్రతినెల తనకు భరణంగా కొంత సొమ్మును చెల్లించాలని కోర్టును ఆశ్రయిస్తారు. కానీ యూపీ కి చెందిన దంపతులు ఇందుకు భిన్నంగా భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి అందరిని ఆశ్చర్య పరిచింది ఈ విషయం తెలిసిన కొందరు భార్య భర్తకు భరణం ఇవ్వడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు.
యూపీ కి చెందిన దంపతులు కొన్ని గొడవల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. కానీ తన భార్య ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన పెన్షన్ పొందుతున్న వయసులో తన భర్త విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెన్షన్ పొందే వయసులో విడిపోవడమే కాకుండా భార్య నుంచి భర్త భరణం కావాలని స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు.
2013సంవత్సరంలో కోర్టును ఆశ్రయించి తన భార్య పెన్షన్ నుంచి ప్రతి నెలా తనకు భరణం కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న తన భార్య నుంచి ప్రతి నెల 1000 రూపాయలు భరణంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం తెలిసిన సదరు నెటిజన్లు భర్త ,భార్యకు భరణం ఇవ్వాల్సిందే పోయి భార్య నుంచి భర్త భరణం కోరడం విడ్డూరం అంటూ తమదైన శైలిలో స్పందించారు. గత ఏడు సంవత్సరాల నుంచి కోర్టు విచారిస్తుండగా ప్రతి నెల కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించమనడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని భావిస్తున్నారు.