ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో బలపడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు విషయంలో కేంద్రం చాలావరకు ప్రజలను ఫ్రీగా వదిలేయడంతో కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో బాగా బలపడిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మరో పక్క రోజుకి పది వేల కేసులు నమోదు అవ్వటంతో కేంద్రం కూడా లాక్ డౌన్ విషయంలో ఏమైనా తప్పు చేశామా అని అంతర్మథనంలో పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17 వ తారీకులలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ భేటీ కాబోతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇదే సమయంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సందర్భంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు ఏ మేరకు పనిచేస్తున్నాయి, వంటి విషయాల గురించి ముఖ్యమంత్రుల స్పందన చేసుకోవడానికి మోడీ రెడీ అవుతున్నట్లు టాక్. మరొక పక్క ఇండియాలో స్మశానాలు వద్ద పరిస్థితి చాలా దారుణంగా మారింది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను బంధువులు మరియు కుటుంబ సభ్యులు చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది. ఈ వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియలు సెక్యురిటీ గార్డులు, హెల్త్ కేర్ స్టాఫ్ లు ఫేస్ షీల్డ్ లు, మాస్క్ లు, గ్లౌజులు ధరించి కానిస్తున్నారు.
అంతేకాకుండా స్మశానల వద్ద రోజుకి లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు ముందు ఒకటో లేకపోతే రెండో మృతదేహాలు వచ్చేవి. ప్రస్తుతం వందల సంఖ్యలో మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కొన్ని స్మశానలలో పూర్తిగా కరోనా వైరస్ బారిన పడిన వారికి కేటాయించినట్లు, అంతేకాకుండా మృతదేహాలకు టోకెన్ నెంబర్ కేటాయించి అంత్యక్రియలు చేస్తున్నట్లు…త్వరలోనే ఇండియాలో కోవిడ్ ప్రళయం విలయ తాండవం సృష్టించడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి