ED Raids: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ను గత నెల 30న ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఢిల్లీలోని మంత్రి సత్యేందర్ జైన్ నివాసంతో పాటు మరో ఏడు ప్రదేశాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీలోని ఆరు ప్రదేశాల్లో, గురగ్రామ్ లోని ఓ ప్రదేశంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నెల 9వ తేదీ వరకూ ఈడీ అధికారుల కస్టడీలో మంత్రి జైన్ ను విచారించనున్నారు. కస్టడీలో జైన్ ను విచారించిన ఈడీ అధికారులకు పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తొంది. ఈ కేసులో అదనపు అధారాల కోసం ఈ రోజు ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తొంది. కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలో జరిగిన హవాలా లావాదేవీలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.