2020 ప్రారంభం అయిన నాటి నుంచి అన్ని వింతలు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు తలల, ఒంటి కన్ను జీవులను ఇలా అనేకం చూస్తూనే ఉన్నాము. కరోనాతో ,అకాల వర్షాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వింత లకు కొదవలేదు. ఇటీవలే హిందూ మహా సముద్రంలో రెండు తలల చేప ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో వింత చోటుచేసుకుంది.
ఇండోనేషియా సముద్రం లోకి జాలర్లు వేటకి వెళ్లగా వారికి ఒక షార్క్ చేప చిక్కింది. ఆ చేప అప్పటికే చనిపోయి ఉండటంతో దాని పొట్టను కోయగా అందులో ఓ చిన్నపాటి సైజులో ఓ చేప పిల్ల కనిపించింది. పరీక్షించి చూడగా పెద్ద సైజులో ఒంటి కన్ను మాత్రమే ఉంది. చూస్తేనే దాని రూపం వణుకు పుట్టేలా ఉండటంతో వైరల్ గా మారింది. అయితే ఆ చేప పిల్ల వింతగా ఒంటి కన్నుతో అప్పటికే చనిపోయి ఉంది. దాని ఆకారం మాత్రం భయంకరంగా ఉండడంతో దాని రంగు కూడా విచిత్రంగా ఉండటంతో వెంటనే ఆ చేపను అధికారులకు అప్పగించారు. అది సైక్లోప్స్ రకానికి చెందినదని నిపుణులు వివరించారు. గ్రీకు పురాణాల్లో దీని గురించి వివరణ ఉందని అన్నారు. అయితే సైక్లోపీడియా సమస్య వల్ల కూడా చేపల్లో ఈ లోపాలు కనిపిస్తాయని అటువంటి చేపలు వెంటనే చనిపోతాయి అని పేర్కొన్నారు.