Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకూ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం మద్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చి, ఈ కేసులో కేజ్రీవాల్ ప్రదాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయనను పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. రెండు గంటల పాటు వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ..కొద్ది గంటల తర్వాత తీర్పును వెలువరించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు, కేజ్రీవాల్ తరుపున అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ అభియోగించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. సౌత్ గ్రూపు సంస్థ నుండి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారన్నారు.
పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుండి వంద కోట్లు డిమాండ్ చేశారని వివరించారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారన్నారు. అవి నాలుగు హవాలా మార్గాల నుండి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
మరో పక్క సీఎం కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్దమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈడీ పది రోజుల పాటు కస్టడీ కోరగా, ఆరు రోజులు మాత్రమే కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
YSRCP Vs TDP: ‘మీ పార్టీ వాళ్లే ..కాదు మీ బంధువర్గీయులే’ .. విశాఖ డ్రగ్స్ కేసులో మాటల యుద్ధం