ED: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే. రాజకీయ కక్షలతో సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ తమపై ఈడీ దాడులు చేయిస్తుందని ఆప్ నేతలు ఓ వైపు మండిపడుతున్నారు. మరో పక్క ఇవేళ ఆప్ నేత దీపక్ సింఘ్లా నివాసంతో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తొంది.
పలువురు ఆప్ నేతల సన్నిహితుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. అయితే తాజాగా పంజాబ్ పై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తొంది. ఏకకాలంలో చండీగఢ్ లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ రాడార్ లో మరో ఆప్ నేత ఉన్నట్లు తెలుస్తొంది. ఆప్ నేతలపై తాజాగా జరుగుతున్న ఈడీ సోదాలతో లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..