ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్మరాజ్ నియమితులు అయ్యారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులు అయ్యానని వస్తున్న వార్తలు నిజం కాదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తాను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవడం ఆలస్యం ఎపి గవర్నర్ అయిపోయిందంటూ ట్విట్టర్లో పుకార్లు లేపారని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కూడా తొలుత అభినందనలు తెలియజేస్తూ ట్విట్ చేశారు. ఆ తరువాత మంత్రి ట్వీట్ను తొలగించారు. వదంతులు నిజం అనుకొని చాలా మంది సుష్మాస్వరాజ్కు ట్విట్టర్ వేదికగా అభినందనలు కూడా తెలియజేశారు. దీంతో ఆమె ట్విట్టర్ వేదికగానే స్పందించి వివరణ ఇచ్చారు.
The news about my appointment as Governor of Andhra Pradesh is not true.
— Sushma Swaraj (@SushmaSwaraj) June 10, 2019