బిజెపి సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. ఆమె ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. అప్పటినుండి ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఇటీవల జరిగిన సర్వ త్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఆమెకు భర్త ఒక కుమార్తె ఉన్నారు. సుష్మ మృతికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో సహా వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.