అమరావతి: టిడిపి నేత,మాజీ స్పీకర్ కోడెల శివరప్రసాదరావు, ఆయన తనయుడు శివరామకృష్ణలకు హైకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో వారిద్దరికి బెయిల్ లభించింది. కోడెలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అసెంబ్లీ ఫర్నీచర్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
previous post
next post