బ్లాక్ బస్టర్ హిట్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అందుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో సిద్దమయ్యారు. ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా వైజాగ్ లో ఈ సినిమా స్క్రిప్ట్ కి పూజ చేయించాడు కూడా. డీసెంట్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టున్న ఎఫ్ 2 100 కోట్ల వసూళ్ళని రాబట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ రూపొందించాలని దిల్ రాజు – అనిల్ రావిపూడి అప్పుడే ఫిక్సైయ్యారు. అంతేకాదు సీక్వెల్ లో నటించడానికి వెంకటేష్ – వరుణ్ తేజ్ కూడా ముందే ఫిక్సైపోయారు.
అనుకున్నట్టుగానే ఎఫ్ 3 పట్టాలెక్కబోతోంది. ఈ నెల 14 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలబోతోంది. ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమా కోసం నారప్ప ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేశాడు. ఇటీవలే క్లైమాక్స్ ని కంప్లీట్ చేసిన వెంకీ ఎఫ్ 3 కోసం రెడీ అయిపోయాడు. అయితే డిసెంబర్ 14 నుంచి మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ లో వెంకటేష్ తప్ప వరుణ్ తేజ్ పాల్గొనడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం వరుణ్ తన చెల్లి నిహారిక పెళ్ళి పనుల్లో బిజీగా ఉండటమే.
నిహారిక పెళ్ళి పనులన్ని పూర్తయ్యాక వరుణ్ ఎఫ్ 3 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. ఇక ఈ సినిమాని నాన్ స్టాప్ గా కంప్లీట్ చేసి 2021 సమ్మర్ కి లేదా విజయదశమి పండుగ సందర్భంగా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పక్కా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాని త్వరగానే ఫినిష్ చేస్తాడు. ఏ సినిమాకి 6 నెలలకి మించి సమయం తీసుకోడు. కాబట్టి సమ్మర్ లేదా దసరా కి ఎఫ్ 3 వచ్చేస్తుంది.
కాగా ఈ సినిమాలో మరో హీరోగా మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారకంగా ఈ విషయాన్ని వెల్లడించనప్పటికి అనిల్ రావిపూడి రాసిన క్యారెక్టర్ కి రవితేజ కరెక్ట్ గా సూటవుతాడని అంటున్నారు. ఇక ఈ క్యారెక్టర్ పూర్తి కన్ ఫ్యూజన్ తో సాగుతూ కడుపుబ్బా నవ్విస్తుందట. ఇలాంటి క్యారెక్టర్ రవితేజ కి కొట్టిన పిండి. కాబట్టి ఎఫ్ 2 ని మించి ఎఫ్ 3 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మోతాదు బాగానే ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!