Fast Action Injection: గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన సమయంలో వాడిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజక్షన్ గురించి చాలా మందికి తెలుసు కదా. ఆ ఇంజక్షన్ చేసుకున్న తరువాత మూడవ రోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇంజక్షన్ భారత్ లోనూ అందుబాటులోకి వచ్చాయి. రోచే కంపెనీకి చెందిన ఈ కాక్ టెయిల్ ఇంజక్షన్ ను ఇటీవల హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో 40 మంది కరోనా రోగులకు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. కాక్ టెయిల్ తీసుకున్న వారంతా తేలికపాటి ఇన్ఫెక్షన్ కల్గినవారేనని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు.
కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన మూడు నుండి వారం రోజుల్లోనే వీరందరికీ కాక్ టెయిల్ అందించినట్లు తెలిపారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారందరిలో 24 గంటల వ్యవధిలోనే జ్వరం, నీరసం వంటి కోవిడ్ లక్షణాలు అన్ని మటుమాయం అయ్యాయని డాక్టర్ నాగేశ్వరరెడ్డి చెప్పారు.
డెల్టా వేరియంట్ పై ఈ ఔషదం పని తీరు, ప్రభావశీలతను తెలుసుకునేందుకు తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అధ్యయనం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇంజక్షన్ అందించిన వారం రోజుల తరువాత వారికి ఆర్ టి పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. ఎంతో వేగంగా వైరస్ ను నిర్మూలించి ఈ ఔషదం (ఇంజక్షన్) ఖరీదు భారత్ లో రూ.70వేలు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారు ఆసుపత్రిలో అడ్మిట్ కానవసరం లేదుట.
ఈ ఇంజక్షన్ ను తొలిసారిగా ఏపిలో గత నెల 30న వినియోగించారు. గుంటూరులోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి కాక్ టెయిల్ ఇంజక్షన్ ఇచ్చారు.