ఢిల్లీ, జనవరి 8: భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే జయంతి భన్సాలీని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున భుజి-దాదర్ ఎక్స్ప్రెస్లో భుజి నుండి అహ్మదాబాద్కు రైల్లో ప్రయాణిస్తున్న భన్సాలీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. తలకూ, ఛాతీకి తూట గాయాలు తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భన్సాలీ గద్దర కూడా తుపాకీ ఉండడంతో జరిగినది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం గుజరాత్ రాష్ట్రంలోని భాచౌ-సమకియా రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రైలు మాలియా స్టేషన్ చేరుకున్నప్పుడు తోటి ప్రయాణీకుడు మేల్కొని పోలీసులకు తెలిపాడు. మాలియా స్టేషన్లో రైలు నిలిపివేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ఈయన రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో బిజెపిలో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2018లో కేసు పెట్టిన మహిళ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది.
previous post
next post