విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగిన కారణంగా పది మంది మృతి చెందిన విషయం తెల్సిందే. మరికొంత మంది గాయపడ్డారు. రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.
ఇప్పుడు ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి? ఎవరి నిర్లక్ష్యం పాళ్ళు ఎంత? అనే విషయమై నిగ్గుతేల్చడానికి ఘటనా స్థలికి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ ఘటనా స్థలికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించనున్నారు. అగ్నిప్రమాదానికి కల కారణాలను క్షుణ్ణంగా ఈ కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే జిల్లా కమిటీ స్థలాన్ని పరిశీలించి నివేదికను కృష్ణ జిల్లా కలెక్టర్ ను సమర్పించారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ రాకతో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది.