భారతదేశంలో ఆకలితో అలమటించే నిరుపేదలు ఎక్కువ ఉన్నందున అటువంటి వారికీ కేవలం రూపాయికే భోజనం అందించేందుకు టీమిండియా మాజీ ఓపెనర్ మరియు తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ‘జన్ రసోయ్’ క్యాంటీన్ల ను ప్రారంభించారు. ఆయన తొలి క్యాంటీన్ ను తన పార్లమెంటు పరిధిలోని గాంధీ నగర్ లో గురువారం ప్రారంభించనున్నారు. అటు పిమ్మట రెండవ కాంటీన్ ను గణతంత్ర దినోత్సవం రోజున అశోక్ నగర్ లో ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ఆర్థిక స్థితిగతులు కానీ కులం మరియు మతాలతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశంతో ఈ కాంటీన్ లను ప్రారంబిస్తున్నట్లు ఆయన తెలియజేసారు.. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉందని అది దృష్టిలో పెట్టుకునే ఈ జన్ రసోయి క్యాంటీన్లకు శ్రీ కారం చుట్టానని గంభీర్ చెప్పారు.
ఢిల్లీలోని ప్రముఖ వస్త్ర మార్కెట్ అయిన గాంధీ నగర్ లో ఈ జన్ రసోయి కాంటీన్ లను పూర్తి ఆధునికతో రూపొందించనున్నారు. ముఖ్యంగా దేశం లోని నిరుపేదల ఆకలి తీర్చడానికే ఈ రూపాయికే భోజనం అనే ఆలోచన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కాంటీన్ లలో భోజనంలోకి బియ్యం, ధాన్యాలు కూరగాయలు ఉంటాయి.
ఒకేసారి వంద మంది కూర్చునే భోజనం చెయ్యడానికి వీలు ఉండేలా ఈ కాంటీన్లను రూపొందించారు. కానీ.. ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ ఉన్న నేపధ్యంలో కేవలం 50 మందికి మాత్రమే ఒక్కసారి భోజనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి భోజన క్యాంటీన్లను ప్రారంభించి సబ్సిడీతో ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇంత సాహసం చేసి దేశ రాజధానిలో రూపాయికే భోజనం పెట్టాలన్న గౌతం గంభీర్ ఆలోచనను అభినందించాలిసిందే.