LIC: LIC IPOకోసం ఎదురు చూస్తున్న వారికి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, LIC పబ్లిక్ ఇష్యూ (IPO) వాయిదా పడే సూచనలు మెండుగా వున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఓ మీడియా వేదికగా దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. LIC IPOపై ముందుకు వెళ్లాలని చూస్తున్నాం, ఇక అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించకపోతే, IPOపై సమీక్ష జరపవలసి ఉంటుందని అన్నారు. ఇక దీన్నిబట్టి LIC IPOపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
LIC: LIC పాలసీదారులారా, అప్రమత్తంకండి.. నేడే లాస్ట్ డేట్ …!
LIC: నిజానికి జరగాల్సింది ఇప్పుడే:
నిజానికి ఈ నెల 11వ తేదీనే LIC IPO ఉండొచ్చని మర్చంట్ బ్యాంకులు అభిప్రాయం వ్యక్తపరిచాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితులు భిన్నంగా వున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే సెన్సెక్స్, నిఫ్టీ మూడు నుంచి 3.1 శాతం వరకు నష్టపోయాయి. LIC IPO గురించి తాను గతంలో మాట్లాడినపుడు ఉన్న పరిస్థితిని, ఇప్పుడు ఉన్న పరిస్థితులనూ ఆర్థిక మంత్రి సీతారామన్ చాలా క్లియర్ గా వివరించారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ LIC IPO విషయం సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
LIC: LIC IPOను ఖచ్చితంగా తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్
ఎన్నాళ్ళు పడుతుందో?
తాజా పరిస్థితుల వలన మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు గురౌతోంది. FIIలు, LIC IPO మీద అంత ఆసక్తితో లేవనే వార్తలు విరివిగా వినిపిస్తున్నాయి. మరోవైపు రెగ్యులేటరీ సంస్థలు కూడా ఇంత హడావుడిగా IPOను క్లియర్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నట్టు గూగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో LIC IPOపై తొందరపడడం కంటే మార్కెట్లు కుదుటపడే వరకు వేచి చూసి, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) మార్కెట్కు వెళ్లడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.