YouTube : కంటెంట్ క్రియేటర్లకు అధిక ఆదాయం అందించే నూతన మార్గాలను సృష్టించడానికి యూట్యూబ్ నడుంబిగించింది. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదనకు యూట్యూబ్ను ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే అటువంటి వ్యక్తుల కోసం యూట్యూబ్.. “యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం”ను పరిచయం చేసింది. ఈ ప్రోగ్రాంలో అర్హత సాధించిన క్రియేటర్లు యూట్యూబ్ టూల్స్ యాక్సెస్ చేస్తూ అదనంగా మనీ సంపాదించొచ్చు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా క్రియేటర్లు చేరారు. గడిచిన మూడేళ్ల కాలంలోనే క్రియేటర్లు, కళాకారులు, మీడియా కంపెనీలకు 30 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించామని యూట్యూబ్ కంపెనీ బ్లాగ్ తెలిపింది.
BREAKING : పెన్షన్ దారుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం…!
“యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం”లో అర్హత పొందడం అనేది పేజీ మెయిన్ థీమ్, ఎక్కువగా వీక్షించిన వీడియో, సరికొత్త వీడియోలు, వాచింగ్ లో అత్యధిక భాగం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. 12 నెలల వ్యవధిలో ఛానెల్కు కనీసం 1000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలి… 4 వేల గంటల వాచింగ్ హౌర్స్ ఉంటేనే ఇందులో భాగస్వాములు అవ్వడం సాధ్యమవుతుంది. ఈ ప్రోగ్రాం లో చేరిన తర్వాత క్రియేటర్లకు తమ ఛానెల్స్ మానిటైజేషన్ పై మరింత కంట్రోల్ కలిగి ఉంటారు. క్రియేటర్లు తమ వీడియోలతో మనీ సంపాదించడానికి ఈ ప్రోగ్రాం టూల్స్ బాగా ఉపయోగపడతాయి. అప్ లోడ్ చేసే ముందు ఎడిట్స్ చేసేందుకు వీలుగా ఈ టూల్ యూస్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ క్రియేటర్లను ప్రోత్సహించడానికే ఈ ప్రోగ్రాం అందుబాటులో చేస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది.
Breaking : కేరళలో కరోనా టెన్షన్ టెన్షన్… ఏకంగా రోజుకి అన్ని కేసులా..!
ఇకపోతే తమ పాలసీలను ఉల్లంఘించిన ఛానెల్ లను ఎప్పటికప్పుడు రివ్యూ చేసి.. అవసరమైతే శాశ్వతంగా తొలగిస్తామని యూట్యూబ్ తెలిపింది. ద్వేషాన్ని కలిగించే తప్పుడు సమాచారంతో రన్ అవుతున్న ఛానళ్లను సైతం బ్యాన్ చేస్తామని తెలిపింది. క్రియేటర్స్ వీడియోలు అప్లోడ్ చేసే ముందు “చెక్స్” అనే టూల్ ద్వారా హానికరమైన/ ప్రమాదకరమైన కంటెంట్ ని గుర్తించి యూట్యూబ్ తగిన చర్యలు తీసుకుంటుంది.