కరోనా తో ప్రపంచం మొత్తం గడగడలాడుతోంది. కరోనాకి ధనిక, పేద..కులం..మతం..ప్రాంతం అనేవి లేవు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు తీయడానికి సిద్దమవుతోంది. ఆమాటకొస్తే ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్న వదలడం లేదు. ఈ క్రమంలోనే గాన గంధర్వుడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఆయన కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ప్రస్తుతం బాలు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథంలో బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా ప్రార్థించారు. రజినీకాంత్ తోపాటు కమల్ హాసన్ – ఇళయరాజా – రెహమాన్ – థమన్ – లాంటి ప్రముఖులంతా బాలు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు. అలాగే అలాగే మరో లెజెండరీ సింగర్ హరిహరన్ మనందరం బాలు గారు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు తండ్రి ఆరోగ్యం విషయంలో తీవ్రంగా బాధపడుతున్నాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని చరణ్ తెలిపాడు. చెన్నైలోని ఎంజిఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో వెంటిలేటర్ మరియు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఇసిఎంఓ) సపోర్ట్ తో చికిత్స జరుగుతోందని తెలిపాడు.
బాలు గారు ఆస్పత్రిలో చేరిన సమయంలో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని చరణ్ పేర్కొన్నారు. వెంటిలేటర్పైనే ఉన్న బాలు కి గత వారం రోజులుగా కృత్రిమ శ్వాసే అందిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలు కోసం విదేశాల నుంచి వైద్యుల్ని రప్పించారట. అయితే విదేశాల నుంచి వైద్యుల సమక్షంలో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎలాంటి ప్రమాదము ఉండదని అంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!