ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయం చూసారు..! అంతకు మించి వైద్యమూ చేశారు..! ఓ దశలో “రాజకీయ వైద్యమూ” చేయదలచారు..! ఇప్పుడు మాత్రం కరోనాకి తలొంచారు…, కట్టుకున్న భార్యకి తలొగ్గారు..! ఆ వీడియోనే ఇది.
పొలం చేరి, పలుగు పట్టి.., పార పెట్టి, మట్టి తీసి.., తట్ట నింపి, కూలి చేసి.., ఇష్ట ఇంతితో ఇంటికెళ్లి… తనలో రాజకీయుడు, వైద్యుడే కాదు కాలానుగున కూలీ కూడా ఉన్నాడని నిరూపించారు. ఆయనే దగ్గుబాటి. రాజకీయ గురు. ఎన్టీఆర్ అల్లుడు. అయిదు సార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీ(పార్లమెంటు), మరోసారి రాజ్యసభ సభ్యుడు. కరోనా కాలంలో ఆయన సతీమణి పురంధేశ్వరితో కలిసి మంచి కాలం గడుపుతున్నారు. నిత్యం రాజకీయం, జనం అంటూ బిజీగా గడిపే ఈ దంపతులు ఇటీవల కారంచేడులో తమ ఇంటికి చేరారు. అక్కడ భార్య పురంధేశ్వరి చూస్తుండగా… పొలం పనులు చేసి తనలో వైద్యం, రాజకీయమే కాదు శ్రామిక రైతుతత్వం ఉంది అంటూ ఇలా పలుగు, పారా పట్టి కూలీగా మారారు. ఆ వీడియో “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది.