జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలు నడుపుతున్న తీరు జనసైనికులకుగానీ,ఆయన అభిమానులకి గాని అర్థంకావడంలేదు.పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించడం లేదు సరికదా రెండు పడవల మీద ప్రయాణం మొదలెట్టారు.ఏపీలోనే జనసేన పరిస్థితి అంతంత మాత్రమే ఆయన ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహపడుతుండడం పార్టీ వారికే నచ్చట్లేదు.
సరైన దిశ లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సాగుతోందని వారు అంటున్నారు.పవర్ స్టార్ గా టాలీవుడ్ లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఎవరూ కలవకుండానే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు.అలాగని ఫుల్టైమ్ రాజకీయాలు చేయకుండా అప్పుడప్పుడు అతిథి నటుడు మాదిరి ఆయన పొలిటికల్ తెరపై కనిపిస్తుంటాడు. అంతేకాక పవన్ కళ్యాణ్ మరో బలహీనత చంద్రబాబు.ఎందుకనో ఆయన చంద్రబాబును విమర్శించలేరు.2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఉండవచ్చు.అయితే 2019 ఎన్నికల సమయానికి జనసేన వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేసిన తరుణంలో కూడా అప్పట్లో అధికారం లో ఉన్న టిడిపిని కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని టార్గెట్ చేసుకొని రాజకీయం చేశారు .చివరకు చేదు ఫలితం అనుభవించారు.
ఇంకా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ స్టార్ అన్న బిరుదు కూడా టిడిపి వల్లే వచ్చింది.అయినా ఆయన వైఖరి మార్చుకోకుండా ముసుగేసుకొని టిడిపి తోక పట్టుకొని ప్రయాణిస్తునారని,ఇది రాజకీయంగా ఆయనకు పెద్ద నష్టం చేకూర్చ బోతుందన్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించలేక ఉన్నారని జనసైనికులు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇంకో ప్రధాన విమర్శ ఏమిటంటే ఆయన సకాలంలో స్పందించరు. ఎప్పుడో ఆయనకేదో గుర్తొచ్చినప్పుడు ఒక ట్వీట్ వదులుతారు.ఆ తరువాత ఆయనకేమి గుర్తుండదు .ప్రస్తుతం ఏపీలో వరదల రాజకీయము సాగుతుండగా ఎవరికివారు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.నారా లోకేషు మరి యాక్టివ్గా ఉన్నారు.అయితే ఈ పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్ తెరపైకి రాలేదు.ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా చేయలేదు.
బిజెపి తో పొత్తు పెట్టుకున౦దున ఇక అంతా ఏపీలో ఆ పార్టీ చూసుకుంటుందని పవన్ కల్యాణ్ రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది .ప్రస్తుత౦ అంగీకరించిన నాలుగు సినిమాలు కాకుండా వీలైతే మరో రెండు సినిమాలు చేసేయడానికి కూడా పవర్ స్టార్ రెడీ అయిపోయాడట.జనసేనాని వైఖరి వల్ల పార్టీకి మనుగడ ఉండదేమోనని క్యాడర్ ,ఆయన అభిమానులు తీవ్రంగా మధన చెందుతున్నారు.