Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలిసి అయుపన్ కోషీయం అని మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచన స్క్రీన్ ప్లే తో పాటు డైలాగులు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ వర్కింగ్ వీడియో రిలీజ్ చేసి పవన్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో భిమ్ల నాయక్ పాత్ర చేస్తున్నట్లు సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే సినిమాలో పవన్ సరసన ఆ హీరోయిన్ పాత్ర ఎవరు అనే దాని విషయంలో సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు గత కొంత కాలం నుండి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా సినిమా యూనిట్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రొడక్షన్ నెంబర్ 12 అనే పోస్టర్ ద్వారా తాజాగా నిత్యామీనన్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Read More: Pawan kalyan : పవర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్..సంక్రాంతికి బిగ్ ఫైట్
పవన్ సరసన ఫస్ట్ టైమ్ నిత్యమీనన్ నటిస్తుండటంతో సరికొత్త పైర్ కావటంతో.. తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలపై పవన్ అభిమానులు ఈ ఇద్దరి జంట స్క్రీన్ మీద కొత్త తరహా ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఉంటుందని పేర్కొంటున్నారు. మొత్తం మీద అ మల్టీస్టారర్ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ కన్ఫామ్ కావడంతో.. ఈ వార్త మెగాభిమానుల లో సెన్సేషన్ గా మారింది.