కోర్టుల్లో ఎదురు దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా జగన్ ప్రభుత్వం, కోర్టులను ఢీకొనే మరో చర్యకు సిద్ధపడటం ,అదీ అసెంబ్లీలో జరగడం అందరినీ విస్మయ పరుస్తోంది.సెలెక్ట్ కమిటీకి పంపా మంటున్న రెండు బిల్లులను మళ్లీ ప్రభుత్వమే ప్రవేశపెట్టడం తీవ్రమైన చర్యగా హైకోర్టు కూడా పరిగణిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో, సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అక్కడ ఈ రెండు బిల్లులు పాస్ అయ్యాయి. తరువాత శాసనమండలిలో కూడా ఈ బిల్లులు ప్రవేశపెట్టినా, అక్కడ బ్రేక్ పడటం, ఈ బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే మండలిలో చైర్మెన్ చెప్పినా, సెలెక్ట్ కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం అడ్డుపడింది. అయితే ఇదే సందర్భంలో, అమరావతి రైతులు, అమరావతి మార్పు విషయం పై హైకోర్టులో కేసు వేసారు.
ఈ సందర్బంగా, ప్రభుత్వం సమాధానం ఇస్తూ, ఈ ప్రక్రియ అంతా ఇంకా శాసనమండలిలోనే ఉందని, సెలెక్ట్ కమిటీ దగ్గర ఆగింది అంటూ, కోర్టుకు చెప్పింది. మొన్న నెల రోజుల క్రితం కూడా, శాసన వ్యవస్థలో ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం, కోర్టుకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ప్రభుత్వం చేసిన పనితో అందరూ అవాక్కయ్యారు.
సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను, శాసనసభలో మళ్ళీ ప్రవేశ పెట్టారు. చర్చ ఏమి జరగకుండానే ఆమోదించుకున్నారు. అయితే, ప్రభుత్వం చేసిన ఈ చర్య, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అంటూ, పలువురు వాపోతున్నారు. ఇప్పటికే రెండు బిల్లులను మండలి చైర్మెన్, సెలెక్ట్ కమిటీకి రెఫెర్ చేసారని, ఇప్పటికే ఈ రెండు బిల్లులు, గవర్నర్ దగ్గర, అలాగే హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లులు ప్రవేశ పెట్టుకుని, మళ్ళీ ఆమోదించుకోవటం, చట్ట విరుద్ధం అని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే కోర్టుల్లో 70కు పైగా మొట్టికాయలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోగుట్టుకుంది. అయితే వీటి నుంచి పాఠాలు మార్చుకుని, ముందుకు వెళ్ళాల్సిన ప్రభుత్వం, కోర్టులతో డీ అంటే డీ అంటుంది. ఈ వ్యవహారంలో మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోవడం కూడా ఖాయమని, ఇంకోసారి జగన్ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని న్యాయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి