ఢిల్లీ, జనవరి : దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా ఎనిమిదవ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె కస్తూరి రంగన్ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానంపై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా ఈ కమిటీ ముసాయిదా నివేదికలో పలు కీలకమైన సూచనలు చేసింది. రాష్ట్రాలు అంగ్లం, హిందితో పాటుగా ప్రాంతీయ భాషతో కలిపి అన్ని సబ్జెక్టులు అమలు చేయడానికి కట్టుబడి ఉండాలని తెలిపింది. సామాన్యశాస్ర్తం, గణితం వంటివి ఒకే సిలబస్ ఉండవచ్చని సూచించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ర్టాల్లో హిందీ తప్పనిసరిగా లేదు.
కస్తూరి రంగన్ కమిటీ తయారు చేసిన నివేదిక మానవ వనరుల శాఖ వద్దకు చేరిందనీ, తనను కలిసేందుకు అనుమతి తీసుకున్నారన కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు.
previous post
next post