ప్రభాస్ రీసెంట్ గా కమిటయిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాని దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా కనిపిస్తాడని డైరెక్టర్ ఓం రౌట్ చిన్న హింట్ కూడా ఇ చ్చాడు. దాంతో ప్రభాస్ పక్కన సీత గా నటించబోయోది ఎవరు అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో తెలుగు, తమిళం, హిందీ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
గతంలో నయనతార ప్రభాస్ తో యోగి అన్న సినిమా చేసింది. చూడటానికి ఈ ఇద్దరి పేయిర్ బావుంటుంది. అదీకాక ఇంతకముందు బాపూ, బాలక్రిష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన రామరాజ్యం సినిమాలో సీతగా నయనతార నటించి ఆకట్టుకుంది. అందుకే ఇపుడు ప్రభాస్ పక్కన సీతగా నయనతార అయితే బావుంటుందన్న మాట వినిపిస్తుది.
మరో వైపు చూస్తే కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మహానటి సినిమాతో కీర్తి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రభాస్ కి జోడీగా అంటే ఫ్రెష్ కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. అంతేకాకుండా వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ విపరీతమైన పాపులారిటీని సాధించింది.
అందుకే ఆదిపురుష్ లో కీర్తి ని తీసుకోవాలన్న ప్లాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఇద్దరూ కాకుండా సీత పాత్రకి పూజా హెగ్డే పేరు కూడా పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే ప్రభాస్ కలిసి రాధే శ్యామ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వరసలో మరికొన్ని పేర్లు కూడా వినవస్తున్నాయి. మరి దర్శకుడు ఓ రౌత్ ప్రభాస్ కి సీతగా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.
ఇక ప్రభాస్ రాధే శ్యామ్ పూర్తి చేసి నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తాడు. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ లో నటించబోతున్నాడు. అయితే నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందే ఆదిపురుష్ మొదలవుతుందని ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశాక నాగ్ అశ్విన్ సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఏ విషయం త్వరలో క్లారిటీ రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!