ప్రస్తుతం కాలానికి అనుగుణంగా,ఆహారపు అలవాట్లలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. పౌష్టిక ఆహారాన్ని వదిలేసి ఫాస్ట్ ఫుడ్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఫలితంగా వారి శరీర బరువు అమాంతం పెరుగుతుంది. ఒకసారిగా శరీరం బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల చాలామంది తమ శరీర బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
శరీర బరువును తగ్గించుకోవడం కోసం కొంతమంది డైట్ ఫాలో అవుతున్నారు. మరికొందరు జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయడం వంటి వాటిని చేస్తున్నప్పటికీ కొందరిలో శరీర బరువు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీర బరువు తగ్గని వారు ఈ విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గిన వారిలో దాదాపు 90 శాతం మంది ఉదయం లేవగానే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహారం తీసుకోకపోవడం ద్వారా శరీర బరువులో మార్పులు కనిపించవు.ఉదయం ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో అత్యధిక కేలరీలను బర్న్ చేసి మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే ఆకలి వేసే దాకా తినకుండా ఉండటం వల్ల బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ అలా ఉండటం వల్ల ఆకలి పెరిగి మనం చేసే పని సరిగా చేయడమే కాకుండా,ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోలేము.అందువల్ల ఆకలి వేసిన, వేయకున్నా సరైన టైంకి తినడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
బరువు తగ్గడం కోసం కొంతమంది ఒకపూట తినడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం ఏమో కానీ, అధిక బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలలో మార్పులు సంభవించి, దాని ఫలితం భవిష్యత్తులో మన జీర్ణక్రియపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సరైన సమయానికి ఎక్కువ పరిమాణంలో కాకుండా, కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.