యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా దగ్గుబాటి కలిసి బాహుబలి ఫ్రాంఛైజీలో నటించిన సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరిని సరి సమానంగా చూపించాడు. ప్రభాస్ – రానా పోటీ పడి మరీ నటించాడు. బాహుబలి కన్క్లూజన్ లో క్లైమాక్స్ ఇప్పటికే ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటారు. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వా ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు కమిటవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ ఆకాశాన్ని తాకుతోంది. బాలీవుడ్ సహా ఏ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రభాస్ రేంజ్ స్టార్ ఇప్పుడు లేనట్టే అని చెప్పుకుంటున్నారు.
ఇక రానా కి బాహుబలి సినిమాల తర్వాత నేషనల్ వైడ్ గా విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. అంతేకాదు కాదు రానా చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా భారీ బడ్జెట్ తోనే రుపొందుతున్నాయి. ఇప్పటికే బహుభాషా చిత్రంగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగుతో పాటు హిందీ.. తమిళం లో కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం రానా పూర్తిగా తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు. అడవి మనిషి పాత్రలో కనిపిస్తున్న రానా లుక్ ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేస్తోంది.
కాగా ఈ సినిమా తర్వాత విరాట పర్వం అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ ఆఖరు వరకు పూర్తవుతుందని సమాచారం. అలాగే దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న హిరణ కశిప కూడా జనవరి తర్వాత సెట్స్ మీదకి రాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది కాని లేదంటే ఈ పాటికి చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యేది.
కాగా తాజా సమాచారం ప్రకారం రానా మరోసారి ప్రభాస్ తో కలిసి నటించబోతున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా ప్రభాస్ కెజిఎఫ్ దర్శకుడితో సలార్ అన్న యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రకటించాడు. పాన్ ఇండియన్ సినిమా గా తెరకెక్కనుండగా 2021 జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. 2022 లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెజీఎఫ్ ని నిర్మించిన హోంబలే నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుండగా ఈ సినిమాలో రానా ప్రభాస్ ని ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరి ది ఎంతవరకు నిజమో గానీ ఈ వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.