తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన స్లీవ్స్ కామెంట్స్.. రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. గుంటూరుజిల్లా ఫిరంగి పురంలో నిర్వహించిన.. వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ప్రసంగించా రు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి.. ఇక, స్లీవ్స్ మడత పెట్టే సమయం వచ్చింది! అని వ్యాఖ్యానిం చారు. స్లీవ్స్ అంటే.. చొక్క చేతులను మడత పెట్టడం.. అని అర్థంలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీంతో యువతను ఆయన ఎన్నికల దిశగా నడిపించేందుకు రెడీ అయ్యారనే వ్యూహంలో వైసీపీ నాయకులు చెబుతున్నారు.
గతంలో విశాఖలో నిర్వహించిన సిద్ధం సభలోనూ.. నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని అన్న కామెం ట్లు జనంలోకి జోరుగా వ్యాపించాయి. మాస్ నుంచి క్లాస్ వరకు కూడా ఈ కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి ఇక, ఇప్పుడు స్లీవ్స్ మడత పెట్టండి కామెంట్స్ కూడా.. అదేతరహాలో ప్రచారం అవుతాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మాస్ను టార్గెట్ చేసుకున్న వైసీపీ అధినేత.. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మాస్ డైలాగులతో ఇటీవల మాట్లాడుతున్నారు.
చిత్రం ఏంటంటే.. పలు చోట్ల సభలు పెట్టినా.. చూసి చదువుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ, సిద్ధం సభలోనూ.. తాజాగా ఫిరంగి పురంలో నిర్వహించిన వలంటీర్ల సభలోనూ సీఎం జగన్ ఎక్కడా చూసి చదివింంది లేదు. ఆయన ఓన్గానే కొన్ని కామెంట్లు చేశారు. కొన్ని కొన్ని విషయాలను మాత్రమే చూసి చదివారు. ఇలానే స్లీవ్స్ మడత పెట్టండి అనే కామెంట్లు కూడా.. ఎవరూ రాసి ఇచ్చినవి కాకపోవడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లు కీలకంగా మారాయి. దాదాపు 70 లక్షలకు పైగానే యువ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో మెజారటీ(ఓట్లు.. వేస్తే కనుక) అవి జనసేనకు పడే అవకాశం ఉంది. దీనిని గమనించిన వైసీపీ వ్యూహాత్కంగా వాటిని తమవైపు తిప్పుకొనేందుకు.. ఇలా ప్రకటనలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. యువతను ఆకర్షించడం ద్వారా.. ఎన్నికల్లో మేలు చేకూర్చుకు నేందుకు వైసీపీ అధినేత ఇలా కామెంట్లు చేశారనేదివారి విశ్లేషణ. ఏదేమైనా.. స్లీవ్స్ మడత పెట్టడమే! అన్న డైలాగు జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.