ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. హీట్ మామూలుగా లేదు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించుకుంటూ వెళుతున్నారు. అటు జనసేన + టీడీపీ పొత్తు ఖరారు కావడంతో కాపుల ఓట్లు కూటమి వైపు మొగ్గు చూపుతాయా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు, కాపు వర్గంలోని ఉపకులాల ఓటింగ్ అంతా కూటమి వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా వైసీపీకి ఎఫెక్ట్ పడుతుందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.
అయితే జనసేన ఓటింగ్ కూటమికి ప్లస్ కాకుండా జగన్ ఎక్కడికక్కడ ఈక్వేషన్లు వేసుకుంటూ పొత్తును ముందే చిత్తు చేసే ప్లాన్లో ఉన్నారు. జనసేన ఓటింగ్ బలంగా ఉన్న చోట కాపులకు పార్లమెంటు సీట్లు ఇస్తున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన + టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. అందుకే ఇక్కడ కాపు వర్గానికే చెందిన చలమలశెట్టి సునీల్కు జగన్ సీటు ఇచ్చారు. ఆయన గత మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ సానుభూతి కూడా కలిసి వస్తుందని జగన్ లెక్కలేస్తున్నారు.
ఇక బందరు పార్లమెంటు పరిధిలోనూ కాపులు ఎక్కువ. పొత్తు ఉంటే ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీకి ఇబ్బంది తప్పదంటున్నారు. పైగా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి జనసేనలో చేరి ఆ పార్టీ నుంచే పార్లమెంటుకు పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే బందరు నుంచి కాపు వర్గం నుంచే అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ను రంగంలోకి దించుతున్నారు. ఇక గుంటూరు పార్లమెంటును కూడా జగన్ కాపు ఈక్వేషన్తో గెలుచుకునే ప్లాన్ చేస్తున్నారు.
పార్టీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను రంగంలోకి దించారు. గుంటూరు పార్లమెంటు సీటును కూటమి ఎలాగూ కమ్మలకే ఇవ్వనుంది. పైగా ఇది అమరావతి ప్రాంతం కావడంతో వైసీపీకి చాలా టఫ్సీటు. అందుకే కమ్మేతర ఓట్లతో పాటు కాపు ఓట్లను కలుపుకుని ఈ పార్లమెంటు సీటును గెలుచుకునే ప్లాన్తో జగన్ ఇక్కడ ఉమ్మారెడ్డి వెంకటరమణకు సీటు ఇచ్చారు. ఏదేమైనా జనసేన ఓట్లు టీడీపీ వైపు మళ్లకుండా జగన్ ఈక్వేషన్లు అయితే మామూలుగా లేవు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!