తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉన్న కొండపోచమ్మ సాగర్ కుడి కాల్వకు గండిపడింది. మర్కుక్ మండలం శివారు వెంకటాపురం వద్ద గండి పడటంతో గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. సమాచారం అందుకున్న అధికారులు ప్రవాహాన్ని నిలిపివేశారు. ఈరోజు ఉదయం 7గంటల సమయంలో కాలువకు గండి పడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు అంటున్నారు.
గండి ప్రభావానికి పోలాలు, తోటలు ముంపుకు గురయ్యాయి. ఇటివలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఈ కుడికాల్వ నుంచే యాదాద్రి జిల్లాకు నీటిని విడుదల చేస్తారు. దీంతో ప్రస్తుతం గ్రామమంతా వరద నీటిలో చిక్కుకుంది.