సరిగ్గా “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అన్న టైం లో మహేష్ బాబు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలామంది దుబాయ్ లో సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెళ్తున్నట్లు భావించారు. ఈ విషయంలో మొదటిలో మహేష్ అభిమానులు కూడా అదే అనుకున్న చివరాకరికి అసలు విషయం బయటపడింది.
సినిమా షూటింగ్ కుటుంబసమేతంగా ఎవరు వెళ్లారు పైగా కరోనా లాంటి మహమ్మారి బయట విజృంభిస్తున్న తరుణంలో అంటూ ఆరా తీస్తూ ఉండగా విషయం బయటపడింది. మేటర్ లోకి వెళితే జనవరి 22వ తారీకు భార్య నమ్రత పుట్టిన రోజు సందర్భంగా.. పుట్టినరోజు వేడుకలు కుటుంబ సమేతంగా చేసుకోవడానికి వెళ్లినట్లు తాజా టాక్.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు నమ్రతా శిరోద్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ టూర్ ముగియగానే మహేష్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్లో పాల్గొన్న బోతున్నారట. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలకు సంబంధించి టీజర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అవగా.. మహేష్ కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్ కాకపోవడంపై అభిమానులకు కొంత నిరుత్సాహం చెందగా తాజాగా.. సోషల్ మీడియాలో కుటుంబ సమేతంగా ఆయన దిగిన ఫోటోలు తో మాత్రం సంతృప్తి చెందుతూ ఉన్నారు.