ఇటీవల ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయములో రాబోయే ఐదు నెలలు అనగా జులై నుండి నవంబర్ వరకు ప్రజంట్ ఇస్తున్న ఉచిత రేషన్ పొడిగించినట్లు తెలిపారు. ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో ‘గరీబ్ కళ్యాణ్’ యోజన స్కీమ్ కింద కేంద్రం పేదలకు దేశవ్యాప్తంగా 5 కిలోల ఉచిత రేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్ వరకు ఈ స్కీమ్ పొడిగించినట్లు తాజాగా ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మోడీ చేసిన ప్రకటన బీజేపీ కి ఎక్కువ పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టే విధంగా మారే అవకాశం ఉన్న తరుణంలో…వెంటనే దీదీ మమతా బెనర్జీ అదిరిపోయే స్ట్రాటజీ వేసింది. అదేమిటంటే వచ్చే నవంబర్ వరకు కేంద్రం ఉచిత రేషన్ ప్రకటించగా… , మమతా బెనర్జీ మాత్రం వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలని దీదీ నిర్ణయించుకోవడం జరిగింది.
మోడీ ప్రకటించిన తర్వాత మమతా బెనర్జీ ప్రకటన చేయడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ స్టేట్మెంట్ విని మేధావులు కచ్చితంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో దీదీ చేసిన ప్రకటన ఓటర్లను ప్రభావితం చేయడం గ్యారెంటీ.. తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!