ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు సమాజంలో ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన లావణ్య లహరి సంఘటన దీనికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే గతంలోనే ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి అనేక అద్భుతమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక దేశంలో ఓ రాజుకు మూడు కన్నులు ఉన్న కూతురు జన్మిస్తుంది. అయితే అలాంటి కూతురు జన్మించడం రాజుకి నష్టమని మరియు తనకి వివాహం చేసి పంపించే వరకు ఆయనకు ప్రాణగండం తప్పదని జ్యోతిష్య పండితులు చెప్తారు. దీంతో రాజు ఆమెకు యుక్త వయసు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత తన కుమార్తెకు వివాహం జరిపించడానికి చాలా సంబంధాలు చూస్తాడు. అయితే అమ్మాయికి మూడు కన్నులు ఉండడంతో వివాహం చేసుకునుటకు ఎవరూ ముందుకు రారు. దీంతో అమ్మాయిని వివాహం చేసుకున్న వారికి వజ్ర వైడూర్య బంగారు కానుకలు లో భారీ స్థాయిలో ఇస్తానని రాజు చాటింపు వేయిస్తాడు. అంతేకాకుండా అమ్మాయిని వివాహం చేసుకున్న వారు ఇచ్చిన సిరిసంపదలతో రాజ్యం నుండి దూరంగా వెళ్లిపోవాలని కూడా ఒక షరతు పెడతాడు.
ఈ వార్త కొద్ది సమయంలోనే రాజ్యమంతా విస్తరిస్తుంది. అయినా కూడా ఎవరూ వివాహం చేసుకొనుటకు ముందుకు రారు. అయితే చివరికి ఒక అంధుడు.. వికలాంగుడైన తన తమ్ముడితో రాజ్యంలోనికి వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. దానికి అంగీకరించిన రాజు తన కూతురునిచ్చి అతనికి వివాహం చేసి ముందుగా ప్రకటించినట్లుగా అతనికి అనేక కానుకలు ఇచ్చి రాజ్యం నుండి బయటకు పంపిస్తాడు. కాగా అంధుడు, రాజకుమారి మరియు వికలాంగుడైన సోదరుడు ముగ్గురూ కలిసి జీవిస్తూ ఉంటారు.
అయితే రాజ కుమార్తె వికలాంగుడైన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఎలా అయినా తన భర్తను చంపేసి ఆమె మరిదితో ఎక్కడికైనా దూరంగా వెళ్లి హాయిగా బ్రతకాలి అని రాజకుమారి కి ఆలోచన వస్తుంది. దానిలో భాగంగా ఓ విషపూరితమైన పామును ఇంటికి తీసుకువచ్చి కూర చేసి భర్తకు పెడాదామని భావించి అతని తమ్ముడైన వికలాంగుడి సహాయం తో ఒక పాముని ఇంటికి తీసుకు వస్తారు.
పాము కూర వండుతూ ఇది చేపల కూర అని భర్తతో చెబుతుంది. అంతే కాకుండా మధ్యలో కూర్చుని కూరను కదుపుతూ ఉండమని తన భర్తకి చెప్పి మరిదితో పక్కనే సరసాలాడుతూ ఉంటుంది రాజకుమారి. అయితే ఇంతలో ఆ విషపు పాము కోరల నుండి వచ్చే ఆవిరితో అంధుడికి చూపు వస్తుంది. ఆ అంధుడుకి చూపు రాగానే రాజకుమారి తన తమ్ముడితో సరసాలు ఆడడం కనిపిస్తుంది. అయినా కానీ చూపు రానట్టే ఉండిపోతాడు ఆ అంధుడు.
కాగా మరుసటి రోజు జరిగిన విషయానంతా రాజ్యానికి వెళ్లి రాజుతో చెప్తాడు ఆ వ్యక్తి .అయితే జరిగిన మోసాన్ని గ్రహించిన రాజు తన రెండొవ కూతురిని ఇచ్చి ఆ వ్యక్తి కి వివాహం చేయిస్తాడు.అయితే మనం మంచి మనసుతో ఏదైనా పని చేస్తే ఎదుటివారు మనకి చెడు చెయ్యాలని చుసిన మనకి మంచే జరుగుతుంది అనడానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.
తనకు చూపు లేదు. రాజ కుమారికి ఒకటికి మూడు కళ్ళు ఉన్నాయి. అయితే లోపంలో ఉండే బాధ తనకు తెలుసు కాబట్టి ఆమెను పెండ్లి చేసుకున్నాడు అంధుడు. ఇక్కడ వికలాంగుడైన తమ్ముడి దుర్భుద్ధిని అతని అంగవైకల్యం చూపిస్తోంది. తమ్ముడని తన సంపదలో భాగం ఇస్తూ తనతోనే ఉండనిస్తే నీచపు పనిని చేశాడు. ఇక మూడు కన్నులు గల రాజకుమారికి తన అవలక్షణానికి తగ్గట్లే ఉన్న ఒక్కదానితో సరిపెట్టుకోకుండా ఇలా అతివృష్టి తో చివరికి ఇలా జీవితాన్ని నాశనం చేసుకుంది.