Money: ఈ కాలంలో చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అనేక బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు, ఎల్ఐసి లు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటి వల్ల ప్రయోజనం చాలా అధికంగానే ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపారం చేసే ఉద్యోగం చేసే డబ్బు సంపాదిస్తున్నారు అందుకే ఎక్కువగా సేవింగ్స్ పైన ఫోకస్ పెడుతున్నారు.
ముఖ్యంగా పెట్టుబడికి నమ్మకమైన రాబడి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అందుకోసం వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టడానికి వెతుకుతూ ఉంటారు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే నెలవారి వాయిదాల చెల్లింపుకు పోస్ట్ ఆఫీస్ లో సౌకర్యంగా ఉంటాయని వారి ఆలోచన. మరికొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ మరి కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి రికరింగ్ డిపాజిట్ ల పైన మొగ్గు చూపుతున్నారు.
ఇకపోతే రికరింగ్ డిపాజిట్లు అంటే పెట్టుబడిదారులకు మూలధన హామీని అందించే రుణ సాధనాలు.. బ్యాంకులు ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల కాలవ్యవధికి ఆర్డీలను అందిస్తాయి. పెట్టుబడిదారులు ప్రతినెల నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఆర్డీలు వీలుగా ఉంటాయి. అయితే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయం చేయడంలో మనకు క్రమశిక్షణ జరుగుతుంది. పన్ను పెట్టుబడి పరిధిలోకి వస్తుంది. అలాగే ఆర్డీ ద్వారా వచ్చిన వడ్డీకి పండు మినహాయింపు లేదని గమనించాలి. కానీ ఆర్డీలో పెట్టుబడి పెడితే మనకు సొమ్ము అవసరమైనప్పుడు ముందస్తు విత్ డ్రాకు ఉపయోగపడతాయి. అయితే కొన్ని బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఆర్డి ముందస్తుగా చార్జీలు వసూలు చేస్తాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పొదుపు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.