Adipurush: ప్రభాస్ “ఆది పురుష్” పోస్టర్ రిలీజ్ అయింది. అక్టోబర్ రెండవ తారీకు టీజర్ కూడా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని పోస్టర్ లో సినిమా యూనిట్ తెలియజేసింది. పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా “ఆది పురుష్” తెరకెక్కించడంతో… సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైం బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చేయడంతో…”ఆది పురుష్” రిజల్ట్ ఎలా ఉంటుందో హాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
“బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఒకటి కూడా విజయం సాధించలేదు. దీంతో “ఆది పురుష్” ఎలాగైనా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉండటంతో ఉత్తరాది ప్రేక్షకులు “ఆది పురుష్” రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో భారీ వేడుకగా సినిమా యూనిట్ నిర్వహిస్తూ ఉంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే “ఆది పురుష్” పోస్టర్ పై ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. బాణం పట్టుకుని వీళ్ళు పైకి చూపిస్తూ.. ప్రభాస్ లుక్ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అప్పట్లో బాహుబలి వేడుక జరిగిన సమయంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ … రాజుగా ఎవరిని తీసుకోవాలి అనేదానిపై.. ప్రభాస్ గురించి గతంలో చెప్పిన మాటలను నేటిజెన్ లు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ నటించింది. లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!