అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చక చకా జరుగుతుంది. అయితే తొలి సినిమా అఖిల్ మినహాయిస్తే .. తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు లవ్స్టోరీలే. అయితే ఏవీ అఖిల్ అక్కినేనికి సక్సెస్ను ఇవ్వలేకపోయాయి. అయితే కూడా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కూడా అఖిల్ లవ్స్టోరీనే నమ్ముకున్నాడని సమాచారం. ఇందులో హీరోయిన్ తన ఫ్యామిలీతో కలిసి మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటుంది. ప్లేబాయ్ కుర్రాడు ఒకడు ఆమె జీవితంలోకి కొన్ని కారణాలతో ఎంటర్ అవుతాడు. దాని వల్ల ఆమె లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా అని అంటున్నాయి సినీ వర్గాలు.హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని నటించనుందని టాక్. చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇటు అఖిల్కి.. అటు భాస్కర్కు ఎలాంటి సక్సెస్ను తెచ్చిపెడుతుందో చూద్దాం…
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!