ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ఆలియా భట్, ఓలియా మోరెస్, అజయ్ దేవగణ్ తో సహా కొందరు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ కాన్వాయిస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాల్సింది. కాని వీ.ఎఫ్.ఎక్స్ వర్క్స్…గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేయాలని డేట్ తో సహా అధికారకంగా ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ డేట్ కి ఆర్ ఆర్ ఆర్ రావడం చాలా కష్ఠమన్న మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్న కొరటాల శివ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు తీసి మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను తీశాడు. ఈ సక్సస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ చూసిన చిరంజీవి ఆచార్య కి అవకాశం ఇచ్చాడు. అయితే ఇప్పటికే రెండేళ్ళు చిరంజీవి కోసం వేయిట్ చేసిన కొరటాలకి ఆచార్య మొదలు పెట్టినప్పటి నుంచి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ ఇచ్చిన షాక్ ఒకేసారి రాజమౌళి, రాం చరణ్ లకి గట్టిగా తగిలిందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో రాం చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి షూటింగ్ కి ప్లాన్ చేసి చిత్రీకరణలో పాల్గొనమని కబురు పెడితే కరోనా కారణంగా నిర్మొహమాటంగా ఇప్పట్లో రానని చెప్పిందట. దాంతో ఆర్ ఆర్ ఆర్ లో రాం చరణ్ కాంబినేషన్ లో షూట్ చేయాల్సిన సీన్స్ అన్ని ఇప్పుడు చేయడం కష్టం అని అంటున్నారు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఆచార్యకి డేట్స్ సర్ధుబాటు చేయాలనుకున్న రాం చరణ్ ప్లాన్ కి ఆలియా బ్రేక్ వేసిందని తెలుస్తుంది. మొత్తానికి కరోనాతో రకరకాల రచ్చలు జరుగుతున్నాయని అర్థమవుతోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!